పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి 

0

పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :

సరళీకృత ఆర్థిక విధానాలతో ఆధునిక భారతదేశానికి బాటలు విస్తరించిన అపర మేధావిగా, భారతీయ భవ్యకీర్తిని పెంచిన తెలంగాణ తేజోమూర్తిగా  మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుది చరిత్రలో ప్రత్యేకమైన స్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా,ప్ర‌ధాన‌మంత్రిగా పీవీ చేసిన సేవ‌లు మ‌రువరానివ‌ని పేర్కొన్నారు.స్థితప్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు పీవీ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ  చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *