కార్యకర్తలను ఆదుకుంటం :ఎమ్మెల్యే పద్మారావు

0

కార్యకర్త మృతిపట్ల పద్మారావు దిగ్బ్రాంతి
కార్యకర్తలను ఆదుకుంటామని వెల్లడి
సికింద్రాబాద్, ఆర్ పీ న్యూస్: తార్నాక డివిజన్ కు చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి మాధురి అలియాస్ పప్పీ మృతి పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ కై నిబద్దతతో పనిచేసే ఆమె తన వ్యక్తిగత పరమైన సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడడం శోచనీయమని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీ మార్చురీలో మాధురి మృత దేహాన్ని పద్మారావు గౌడ్ సందర్శించి ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోకుండా ఆత్మహత్యకు పాల్పడడం సరికాదని అన్నారు. దివంగత మధురి తమ పార్టీ కోసం శ్రమించారని, ఆమె కుటుంబసభ్యులను ఆదుకుంటామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని తమ పార్టీ కార్యకర్తలు తమ కుటుంబసభ్యులే నని వారి కష్ట సుఖాల్లో తాము తోడుగా ఉంటామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *